ETV Bharat / snippets

మంత్రాల నెపంతో ఘోరం- ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2024, 5:15 PM IST

Five People Beaten To Death By Villagers
Five People Beaten To Death By Villagers (ETV Bharat)

Five People Beaten To Death By Villagers : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఇట్కల్‌ గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఐదుగురిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటన కుంట పీఎస్‌ పరిధిలోని జరిగింది. చేతబడి వల్ల తమ కుటుంబాల్లో వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యరని, అందుకే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై అదే గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

గురువారం (సెప్టెంబర్ 12) ఇదే విధమైన ఘటనలో భటపరా జిల్లాలోని జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చేతబడి చేశాడనే అనుమానంతో ఒక పసికందుతో సహా ఒక కుటుంబంలోని నలుగురిని హత్య చేశారు.

Five People Beaten To Death By Villagers : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఇట్కల్‌ గ్రామంలో చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఐదుగురిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఈ ఘటన కుంట పీఎస్‌ పరిధిలోని జరిగింది. చేతబడి వల్ల తమ కుటుంబాల్లో వ్యక్తులు అనారోగ్యానికి గురయ్యరని, అందుకే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనపై అదే గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

గురువారం (సెప్టెంబర్ 12) ఇదే విధమైన ఘటనలో భటపరా జిల్లాలోని జరిగింది. గ్రామంలో ఓ వ్యక్తి చేతబడి చేశాడనే అనుమానంతో ఒక పసికందుతో సహా ఒక కుటుంబంలోని నలుగురిని హత్య చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.