భక్తులతో కిటకిటలాడుతున్న యాదాద్రి - దర్శనానికి 3 గంటల సమయం - Devotees Rush in Yadadri Temple - DEVOTEES RUSH IN YADADRI TEMPLE
🎬 Watch Now: Feature Video


Published : Jun 9, 2024, 3:58 PM IST
Yadadri Lakshmi Narasimha Swamy Temple Rush : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు నేటి ఆదివారంతో ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు. తెల్లవారుజామునించే భక్తులు ఆలయ వద్దకు రావడంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని పుష్కరిని ప్రాంగణం, వాహనాల పార్కింగ్, వ్రత మండపం భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Massive Rush in Yadadri Temple : ఆలయంలో స్వామివారి అభిషేక పూజల్లో, నిత్య కల్యాణంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండటంతో ప్రసాద విక్రయశాల, ఆలయ ఆవరణలో భక్తుల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.