పల్నాడు జిల్లాలో దారుణం - నీళ్లు అడిగినందుకు ట్రాక్టర్​తో ఢీకొట్టి చంపేశారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 1, 2024, 3:12 PM IST

thumbnail

Woman Killed by a Tractor for Asking Water in Palnadu District : తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్​తో ఢీకొట్టిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చోసుకుంది. రెంటచింతల మండలం మల్లవరంలో తాగునీటి సమస్య ఉంది. అక్కడి ప్రాంతవాసులకు ట్రాక్టర్​ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇవాళ ట్యాంకర్​ వద్దకు నేనావత్​ సామి (50) అనే మహిళ వచ్చింది. టీడీపీకి చెందిన వారికి నీళ్లు ఇచ్చేది లేదంటూ ట్రాక్టర్​ డ్రైవర్​ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.

తాగునీటి కోసం సామి ట్రాక్టర్​కు అడ్డుగా నిల్చొని మంచినీళ్లు తెచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించింది. ఆమె మాటలు లెక్క చేయకుండా డ్రైవరు ట్రాక్టర్​ను ముందుకు పోనివ్వడంలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లే మార్గంలోనే మృతి చెందింది. తాగునీరు అడిగితే చంపేస్తారా అని బాధిత కుటుంబ సభ్యులు వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనను మాచర్ల టీడీపీ ఇన్​ఛార్జ్​ బ్రహ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.