ఉత్తర, దక్షిణ ద్రోణి వల్ల తెలంగాణలో వర్షాలు - మే 20 తర్వాత మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు - Rain Alert in Telangana

By ETV Bharat Telangana Team

Published : May 6, 2024, 5:50 PM IST

thumbnail
ఉత్తర దక్షిణ ద్రోణి వల్ల తెలంగాణలో వర్షాలు మే 20 తర్వాత మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు (Etv Bharat)

Interview on Rain Alert In Telangana : కొద్ది రోజులుగా విపరీతమైన ఎండ వేడిమితో ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వాతారవణం నేడు కాస్త చల్లబడింది. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 12, 13వ తేదీల వరకు ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, మే 20 తేదీ తర్వాత మళ్లీ ఉష్టోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వివరించింది. 

ఇందుకు కారణం ఉత్తర దక్షిణ ద్రోణి తెలంగాణ మీదుగా తమిళనాడు వెళ్లడం వల్ల దాని ప్రభావం పడనుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాబోయే మూడు నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మే నెలలో ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందనే వివరాల గురించి వాతావరణ కేంద్ర అధికారి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.