Published : Apr 12, 2024, 12:17 PM IST
అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి : యునైటెడ్ పూలే ఫ్రంట్ - Jyothi Rao Phule Jayanti 2024
United Phule Front Demands Installation of Phule Statue : సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని యునైటెడ్ పూలే ఫ్రంట్ కో-కన్వీనర్ బొల్లా శివశంకర్ అన్నారు. ఇదే విషయంపై గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సారథ్యంలో తాము విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ప్రభుత్వాన్ని పలు దఫాలుగా డిమాండ్ చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటు చేసి పూలే జయంతి వేడుకల్లో బొల్లా శివశంకర్ పాల్గొని మాట్లాడారు.
Phule Jayanti Celebrations 2024 : దీనిపై కాంగ్రెస్ సర్కార్ తమ వైఖరి ఎంటో స్పష్టం చేయాలని బొల్లా శివశంకర్ డిమాండ్ చేశారు. కనీసం ఇప్పటికైనా బీసీ కులాల ఓట్లు హస్తం పార్టీకి పడాలంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టమైన హామీతో కూడిన ఓ ప్రకటన చేయాలని అన్నారు. అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి బొల్లా శివశంకర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తి దాయకమని ఆయన తెలిపారు.