కూటమి ప్రభుత్వంతో తిరుమలలో ప్రమాణాలు మెరుగుపడ్డాయి: కేంద్రమంత్రి - Union Minister Visited Tirumala - UNION MINISTER VISITED TIRUMALA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2024, 7:55 PM IST
Union Minister Bhupathiraju Srinivasavarma Visited Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కేంద్ర ఉక్కు, పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పర్యటించారు. తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డితో కలిసి ఆయన అన్న ప్రసాదాలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో అన్న ప్రసాదాలు, లడ్డూ నాణ్యత మెరుగుపడ్డాయని శ్రీనివాస వర్మ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ప్రతి భక్తుడికి అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.
అనంతరం రిజిస్టర్ పుస్తకంలో సంతకం చేసి తన అభిప్రాయాన్ని రాశారు. నిన్న (శనివారం) నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ‘తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బీజేపీ స్వాగతిస్తోందని తెలిపారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంటును లాభాల బాటలో నడిపించడంతో పాటు సంస్థ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు.