thumbnail

కడప వాసులకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Transport Minister inaugurated flights from Kadapa to Hyderabad : కడప నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమాన సర్వీసులను రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు. త్వరలోనే కడప నుంచి చెన్నై, బెంగళూరు, దిల్లీలకు సైతం విమాన సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. కడప జిల్లాకు విమాన సర్వీసులకు పునరుద్ధరించినందుకు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుకి, ఇండిగో యాజన్యానికి ధన్యావాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమాశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కడప నుంచి హైదరాబాదుకు విమాన సర్వీసులు ఉండేవని గుర్తుచేశారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గత ఏడాది నుంచి సర్వీసులు రద్దుచేశారని తెలిపారు. 

దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి సర్వీసులను పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. విమాన సర్వీసులను ప్రజలు ఆదరించాలని సూచించారు. అలాగే మన ప్రభుత్వంలో కడప జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు సెజ్​లు ఏర్పాటు చేస్తే అందులో జిల్లా నుంచి కొప్పర్తి ఉండటం విశేషమన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లనే నేడు విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరము ఏర్పడిందని మంత్రి తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.