LIVE: రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి మీడియా సమావేశం - transport minister live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 1:50 PM IST

Updated : Aug 9, 2024, 2:00 PM IST

thumbnail
Transport Minister Live :  ఆర్టీసీ ప్రతిఒక్కరికీ చేరువైందని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే ఆర్థిక పరమైన అంశాలుంటాయని, వాటి గురించి అన్ని అంశాలు సీఎంతో చర్చించే సంస్థను బలోపేతం చేస్తామని అన్నారు. కార్మికులకు ఎప్పటినుంచే ఉన్న సమస్యలపైనా చర్చిస్తామని భరోసా ఇచ్చారు.రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.రవాణా శాఖలో కొందరు అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో చౌకబియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలివెళ్లాయన్న మంత్రి...ఆ వాహనాలను ఎందుకు పట్టుకోలేదని నిలదీశారు. అక్రమంగా తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక, మైన్స్ తరలింపు వాహనాలపై చర్యలు తీసుకోవాలన్న మంత్రి రవాణా శాఖలో అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అక్రమార్కుల పనిపట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Aug 9, 2024, 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.