By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 10:17 PM IST
ఏపీలో తెలంగాణ సీఎం పర్యటన తేది ఖరారు- విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభకు హజరు కానున్న రేవంత్
Telangana CM Revanth Reddy will Come to Congress Meeting in Vizag: రాష్ట్రంలో పీసీసీ నిర్వహించే బహిరంగ సభకు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ నెల 15 తేదీన కాంగ్రెస్ పార్టీ విశాఖలో నిర్వహించనున్న సభకు హాజరు అవుతారని పీసీసీ వర్గాలు తెలిపాయి. తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చింది. ఇటు విశాఖ సభలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
New Schemes of Congress: పేదరికం నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ నూతన పథకాలు అమలు చేస్తుందని ఇటీవల షర్మిల తెలిపారు. ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని ఇందిరమ్మ అభయం అమలు చేస్తామని, ప్రతి పేద కుటుంబానికి ప్రతినెలా రూ.5 వేలు, మహిళ పేరిట రూ.5 వేల చెక్కు ఇస్తామని కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుందని షర్మిల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకు వస్తాం అని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.