LIVE : ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా జగన్: వర్ల రామయ్య ప్రత్యక్ష ప్రసారం - TDP Leader Varla Ramaiah Live oN YSRCP Defeat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 1:17 PM IST

Updated : Jun 7, 2024, 1:32 PM IST

thumbnail

TDP Leader Varla Ramaiah Live oN YSRCP Defeat : తన ఓటమికి ప్రజలే కారణమంటూ నిందించడం న్యాయమా జగన్​ అంటున్న టీడీపీ నేత వర్ల రామయ్య  ధ్వజమెత్తారు. ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా సాగించిన అరాచక పాలనకు వైఎస్సార్సీపీ మూల్యం చెల్లించుకుంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 165కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీ బొక్కబోర్లా పడింది. మూడు పార్టీలు మూకుమ్మడిగా ఫ్యాన్‌ రెక్కలు విరిగ్గొట్టి పక్కన పడేశాయి. సింహం సింగిల్‌గా వస్తుందంటూ సవాళ్లు చేసిన జగన్‌కు, ఆయన పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. పేదల ముసుగేసుకున్న పెత్తందారీ జగన్‌ను తరిమికొట్టారు. 54 లక్షలమంది రైతులకు పెట్టుబడి సాయం చేశామని తెలిపారు. రైతన్నలను అన్నిరకాలుగా ఆదుకున్నామని వెల్లడిచారు. అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నామని తెలిపారు. వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయామని జగన్​ పేర్కొన్నారు. పేదపిల్లల చదువుల కోసం ఎంతో సాయం చేశామన్నారు. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.

Last Updated : Jun 7, 2024, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.