By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 3:10 PM IST
రాబోయే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది: బీటెక్ రవి
TDP Leader BTech Ravi Campaign: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని టీడీపీ పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జి బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో బీటెక్ రవి (Btech Ravi) పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. పట్టణంలోని స్థానిక బొడ్డు చావిడి వీధిలో తెలుగుదేశం - జనసేన పార్టీ ఉమ్మడి మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ ప్రచారంలో బీటెక్ రవి పాటు ఆయన సతీమణి లతా రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకు ఓటు వేసి చంద్రబాబుకు పట్టం కట్టాలని ఆమె కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇద్దరూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ కరపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కాగా టీడీపీ-జనసేన విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో బీటెక్ రవిని పులివెందుల అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.