Live: ముగిసిన టీడీపీ జనసేన సమన్యయ కమిటీ సమావేశం - మీడియాతో మాట్లాడుతున్న నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 5:07 PM IST

Updated : Feb 22, 2024, 5:25 PM IST

thumbnail

TDP Janasena Coordination Committee meeting live: విజయవాడలో తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం  ఇరుపార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు.  ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగింది. ఉమ్మడి సభకు చంద్రబాబు పవన్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ఈ భేటీలో స్పష్టతకు రానుంది. మేనిఫెస్టో రూపకల్పనపై కీలకాంశాల ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  డ్వాక్రా రుణ మాఫీ హామీ అంశంపై కీలక చర్చ జరిగినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు.  క్షేత్రస్థాయిలో ఇరుపార్టీల సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.  వివిధ జిల్లాల్లో తెలుగుదేశం - ‌జనసేన  ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ తదితర అంశాలపైనా చర్చించారు.  టీడీపీ  సమన్వయ కమిటీ సభ్యులుగా కింజరాపు అచ్చెన్నాయుడు,  యనమల రామకృష్ణుడు,  పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ,  తంగిరాల సౌమ్య ఉన్నారు. జనసేన  కమిటీ సభ్యులుగా ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని పాల్గొన్నారు. 

Last Updated : Feb 22, 2024, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.