By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 12:11 PM IST
|Updated : Mar 30, 2024, 1:30 PM IST
LIVE : ప్రొద్దుటూరు ప్రజాగళం సభలో చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CBN Live
Chandrababu Praja Galam Live: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు శనివారం ప్రొద్దుటూరు, నాయుడుపేట, శ్రీకాళహస్తి ల్లో చంద్రబాబు రోడ్ షోలు, ప్రజాగళం సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయగిరిలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ప్రజాగళం భహిరంగ సభలో పాల్గొన్నారు. ఉదయం బనగానపల్లిలో నిర్వహించిన సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తమది విజన్ జగన్ది పాయిజన్ అని చంద్రబాబు అన్నారు. ఆయన పనిదొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన 'ప్రజాగళం' ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. "మొన్నటివరకు పరదాల చాటున జగన్ తిరిగారు. ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారు. వివేకా హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటెయినర్లో తరలిపోతున్నాయి. మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారు. మూడు రాజధానులు చేశానని ఆయన చెబుతున్నారు. కర్నూలు న్యాయ రాజధాని అయిందా? వైసీపీ పాలనలో అన్ని వర్గాలూ నష్టపోయాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది" అని చంద్రబాబు అన్నారు.
Last Updated : Mar 30, 2024, 1:30 PM IST