ఒంగోలు​లో సైకత శిల్పం - ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం - SVEEP Awareness Program

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 2:51 PM IST

thumbnail

SVEEP Awareness Program in Prakasam District : ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రజలలో చైతన్యం కలిగించేందుకు స్వీప్​లో (Systematic Voter Education and Electoral Participation) భాగంగా ప్రకాశం జిల్లా యంత్రాంగం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని చర్చి సెంటర్​లో ఓటు ప్రాముఖ్యత, ఓటు వినియోగంపై అవగాహన కల్పించే లక్ష్యంతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. 

Sand Sculpture of Vote: సాధారణంగా తీర ప్రాంతాల్లో మాత్రమే చూసే సైకత శిల్పాన్ని ఒంగోలు పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా దీనిని తిలకిస్తున్నారు. విజయవాడకు చెందిన ప్రముఖ సైకత శిల్పి బాలాజీ ప్రసాద్ 24 గంటలు శ్రమించి ఈ సైకత శిల్పాన్ని పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏ. ఎస్. దినేష్ కుమార్ ఈరోజు సైకత శిల్పాన్ని సందర్శించి శిల్పి బాలాజీ ప్రసాద్​ను అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రజల్లో ఓటర్ చైతన్యం కోసం విభిన్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే వినూత్నంగా ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రజలందరూ మే 13వ తేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.