టీచర్ల బదిలీ - భావోద్వేగానికి గురైన విద్యార్థులు - Students Cried For Teacher transfer
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jul 2, 2024, 3:37 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/640-480-21849258-thumbnail-16x9-teachers.jpg)
Students Became Emotional For Teachers Transfer in Medak : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీ నేపథ్యంలో విద్యార్థులు టీచర్లను వెళ్ళొద్దంటూ బోరున విలపిస్తున్నారు. వారిని ఓదార్చే క్రమంలో ఉపాధ్యాయులు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు. అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు విద్యార్థుల ఆత్మీయతను చూసి ఆవేదనకు గురయ్యారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రేణుక, అరుణ బదిలీపై వెళుతున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఉపాధ్యాయులను పట్టుకుని బోరున విలపించారు.
సిద్దిపేట జిల్లాలో కూడా ఇదే తీరున విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. సిద్దిపేటలోని కాళ్ళకుంట కాలనీలో గల యూపీఎస్ ఉపాధ్యాయురాలు జయశ్రీ బదిలీపై వెళుతుండగా తమను వదిలి వెళ్ళొద్దంటూ టీచర్ని పట్టుకుని విద్యార్థులు ఏడ్చేశారు. చేర్యాల మండలం ఆకునూరు పాఠశాలలో ఏడుగురు టీచర్లు బదిలీపై వెళ్లడంతో విద్యార్థులు తమ ఆవేదనను కంటితడి రూపంలో చూపించారు. టీచర్లను చుట్టుముట్టి వెళ్లొద్దంటూ విలపించారు. విద్యార్థులను సముదాయించే క్రమంలో టీచర్లు కూడా భావోద్వేగానికి గురయ్యారు.