thumbnail

తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య - సీసీ టీవీ ఫుటేజ్​లో దృశ్యాలు - Constable Commits Suicide

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 11, 2024, 4:05 PM IST

SPF Constable Commits Suicide in Visakhapatnam: గన్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన పోలవరపు శంకర్రావు (SPF Constable Shankarrao suicide) ద్వారకానగర్​లోని జ్యోతి బుక్ డిపో సమీపంలోని ఐఓబీ బ్యాంక్ వద్ద గన్​మెన్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఈ రోజు ఉదయం 5 గంటలకు విధులకు హాజరైన శంకర్రావు 6 గంటల సమయంలో తన వద్ద ఉన్న తుపాకీతో ఛాతీపై కాల్చుకున్నారు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ సమయంలో పెద్దగా శబ్దం రావడంతో అక్కడే ఉన్న సిబ్బంది వెళ్లి చూడగా శంకర్రావు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారు ద్వారకా పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ద్వారకానగర్ ఏసీపీ రాంబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్​కు తరలించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.