సాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్​- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - Two Dead in Road Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 12:41 PM IST

thumbnail
Road Accident In Krishna District Two Dead (ETV Bharat)

Road Accident In Krishna District Two Dead : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లా నుంచి ఏలూరు వైపు వెళ్తున్న టమాటా లోడ్ లారీ టైరు పంచర్ అయ్యింది. లారీని రోడ్డు పక్కనే నిలిపి డ్రైవర్ మరమ్మతులు చేస్తుండగా ఆ మార్గంలో వెళ్తున్న బొలేరో వాహన డ్రైవర్ సాయం చేసేందుకు వెళ్లారు. 

ఇద్దరు కలిసి పంచర్ వేస్తుండగా సిమెంటు లోడ్ లారీ వేగంగా వచ్చి వెెనుక నుంచి వారిని ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఒక డ్రైవర్ మృతి చెందగా, మరో డ్రైవర్ విజయవాడలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నపురానికి చెందిన చైతన్య శ్రీసాయి, పల్నాడు జిల్లా కొండమాడుకు చెందిన దుర్గారావుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.