కేసీఆర్కు మెదక్ ఎంపీ స్థానం కోసం స్థానిక అభ్యర్థి దొరకలేదా?- రఘునందన్ రావు - Raghu Nandan Rao Fires On Kcr - RAGHU NANDAN RAO FIRES ON KCR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-03-2024/640-480-21057619-thumbnail-16x9-raghu.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 23, 2024, 9:35 PM IST
Raghu Nandan Rao Fires On Kcr : తెలంగాణ ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన మెదక్ గడ్డపై పుట్టిన వారికి బీఫామ్ ఇచ్చేందుకు కేసీఆర్కు ఒక్క అభ్యర్థి కూడా దొరకలేదా అని రఘునందన్ ప్రశ్నించారు. సిద్దిపేట పట్టణంలోని శివనుభవా మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్రావు మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేసేందుకు పక్క జిల్లాల నుంచి అభ్యర్థులను తెచ్చుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కు ఏర్పడిందని ఆయన విమర్శించారు. 13 ఏళ్ల మీ పోరాటం, పరిపాలన తర్వాత ఉద్యమకారులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేసీఆర్ను ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమం స్థానికులకు, స్థానికేతరులకు మధ్య జరిగిన పోరాటమైతే ఇవాళ మెదక్ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని రఘనందన్ రావు ప్రశ్నించారు. మీ కోసం సీటు త్యాగం చేసిన ఒంటేరు ప్రతాప రెడ్డి ఎక్కడున్నారు?. జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసిన భూం రెడ్డి ఎక్కడున్నారు. ఈ జిల్లాలో పుట్టిన వారికి ఎవ్వరికీ టికెట్ ఇవ్వడానికి మీకు మనసు రాలేదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి చేతనైతే నిజమైన తెలంగాణ ఉద్యమ కారులకు టిక్కెట్ ఇవ్వాలన్నారు.