thumbnail

LIVE : వరంగల్​లో ప్రధాని మోదీ బహిరంగ సభ - PM MODI WARANGAL MEETING LIVE

By ETV Bharat Telangana Team

Published : May 8, 2024, 12:26 PM IST

Updated : May 8, 2024, 1:18 PM IST

PM Modi Warangal Public Meeting Live : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తోన్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నారు. లోక్​సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదారాబాద్‌కు చేరుకున్నమోదీ రాత్రి రాజ్​భవన్‌లో బస చేశారు. ఉదయం బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకున్నారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. తర్వాత వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ వరంగల్​లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. 
Last Updated : May 8, 2024, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.