thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 10:38 AM IST

ETV Bharat / Videos

టీడీపీ జనసేన గెలుపుకు కలిసి పనిచేయాలి: నాగబాబు

Nagababu Participated Kapu Meeting In Narasaraopeta: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్ధుల గెలుపునకు కాపులు కలసి పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు (Janasena Party Secretary Konidela Nagababu) కోరారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 'కాపు చేయి చేయి కలుపు- చేజారదు గెలుపు' ఆత్మీయ సమావేశం (kapu Meeting) బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కాపు నేతలతో కలిసి నాగబాబు పాల్గొని పలు రాజకీయ అంశాల గురించి చర్చించారు. 

For Janasena Tdp Parties Victory Kapu Leaders Together To Work: ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించి అమలు చేసిందని పేర్కొన్నారు. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ (TDP)తో కలిసి గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పొత్తు సీట్లలో ఎక్కువ శాతం గెలిస్తే పవర్ షేరింగ్ కూడా సాధ్యం అవుతుందని నాగబాబు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.