ఒంగోలులో రీకౌంటింగ్​కు పట్టు - వెరిఫికేషనే చేస్తామన్న కలెక్టర్​ - నిలిచిన మాక్​పోలింగ్​ - EX MLA Balineni Srinivas Complaint

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 2:27 PM IST

thumbnail
12 నియోజకవర్గాల్లో మాక్‌ పోలింగ్‌- వైఎస్సార్సీపీ నేతలు ఆలస్యం (ETV Bharat)

Mock Polling Stopped in Ongole : ఒంగోలు అసెంబ్లీ స్థానంలో  ఈవీఎంల మాక్ పోలింగ్​ నిలిచింది.  వైఎస్సార్సీపీ ప్రతినిధులు రీకౌంటింగ్ చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు. ఈసీ ఆదేశాల మేరకు వెరిఫికేషన్ మాత్రమే చేస్తామని కలెక్టర్ తేల్చి చెప్పారు దీంతో మాక్​ పోలింగ్​ నిలిచింది.

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదుతో ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు సక్రమంగా జరగలేదని బాలినేని ఫిర్యాదుతో 4 రోజుల పాటు మాక్ పోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఒంగోలులోని ఈవీఎం గొదాముల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ జరుగుతోంది. తొలి రోజు మూడు ఈవీఎంల్లో మాక్ పోలింగ్ చేస్తున్నారు. అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్​ వైఎస్సార్సీపీ నేతలు ఆలస్యంగా రావడంతో కలెక్టర్ లేటుగా ప్రారంభించారు. 

EX MLA Balineni Srinivas Complaint To EC : వైఎస్సార్సీపీ సర్కార్​పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూటమిపై ఉన్న నమ్మకంతో దామచర్ల జనార్దన్​కు ప్రజలు పట్టం కట్టారు. దీనికితోడూ నగరంలో ఆయన అంతకుముందు చేపట్టిన అభివృద్ధి పనులు వెరసి ఈ ఆదరణ లభించినట్లైంది. అయితే ఓటింగ్‌ సరళి, ఈవీఎంలపై తనకు అనుమానాలున్నట్లు వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్న సంగతి తెలిసిందే. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.