LIVE : బంజారాహిల్స్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం
Published : Feb 3, 2024, 11:05 AM IST
|Updated : Feb 3, 2024, 11:31 AM IST
MLC Kavitha Live : అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలంటూ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శాసన సభాపతి నివాసంలో స్పీకర్ గడ్డం ప్రసాదరావును కలిసి భారత జాగృతి తరఫున వినతి పత్రం ఇచ్చారు. ఏప్రిల్ 11 లోపు ప్రభుత్వం ఈ విషయంపై మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటుకు మద్దతుగా రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయనున్నట్లు భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు ప్రతి జిల్లా, విశ్వ విద్యాలయాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే పూలే విగ్రహం అంశాన్ని బీఆర్ఎస్ నేతలు తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో ఫులే విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.