త్వరలోనే కాంగ్రెస్​లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం : ఎమ్మెల్యే దానం - MLA DANAM FIRES ON KCR

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 2:18 PM IST

thumbnail
బీఆర్ఎస్​పై నమ్మకం కొల్పోయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు: ఎమ్మెల్యే దానం (ETV Bharat)

MLA Danam Nagendar Slams BRS Party : మాజీ సీఎం కేసీఆర్​, బీఆర్ఎస్​ నేత కేటీఆర్​లపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్​ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్​ కార్పొరేట్​ కార్యాలయంలా నడిపారని మండిపడ్డారు. కేసీఆర్​ను కలవాలంటే అపాయింట్మెంట్​ కూడా దొరికేది కాదన్నారు. ఒక వేళ దొరికినా గంటల తరబడి వేచి ఉంచేవారని తెలిపారు. త్వరలోనే బీఆర్ఎస్​ ఎల్పీ కాంగ్రెస్​లో విలీనం కాబోతోందని దానం జోస్యం చెప్పారు. 

హిమాయత్​నగర్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్​లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని దానం నాగేందర్​ విమర్శించారు. అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్​లో చేరుతున్నారని వెల్లడించారు. హస్తం పార్టీలో అందరికీ విలువ ఉంటుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్​ హయాంలో ఎమ్మెల్యేలకు స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్ ఉండేదని కేసీఆర్​​ హాయంలో నియోజకవర్గం అభివృద్ధి చేద్దామంటే అసలు నిధులు లేవని ఆరోపించారు. గులాబీ పార్టీ​ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్​ బినామీలు వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చివరకు బీఆర్ఎస్​లో పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.