కృష్ణా హారతి పునఃప్రారంభం - మంత్రి ఆనం నేతృత్వంలో జీఓఎం సమావేసం - Ministers Committee Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 7:01 PM IST

thumbnail
కృష్ణా హారతి పునఃప్రారంభం - మంత్రి ఆనం నేతృత్వంలో జీఓఎం సమావేసం (ETV Bharat)

Ministers Committee Meeting on Resumption of Krishna Harati : కృష్ణా- గోదావరి పవిత్ర సంగమం వద్ద నెల రోజుల్లో కృష్ణా హారతి పునః ప్రారంభించనున్నట్ల అధికారులు తెలిపారు.  కృష్ణా హారతి పునః ప్రారంభించే అంశంపై మంత్రుల కమిటీ సమావేశమైంది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Endowment Minister Anam Ramanarayana Reddy) నేతృత్వంలో జీఓఎం సమావేశమైంది. మంత్రి పార్ధసారధి, పలు శాఖల ఉన్నతాధికారులు ఈ మంత్రుల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి ఆనం పలు సూచనలు చేశారు. కృష్ణా పవిత్ర సంగమ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం ఆదేశించారు. కృష్ణా హారతి కార్యక్రమం కోసం నదిలో తేలే 6 పంట్లు, 10 సెట్ల హారతులు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ఫెర్రీ వద్ద కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పార్ధసారధి అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.