పదేళ్లలో బీఆర్ఎస్ పేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసింది : మంత్రి పొంగులేటి - Minister Ponguleti about BRS
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 3, 2024, 3:35 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-06-2024/640-480-21624487-thumbnail-16x9-minister.jpg)
Minister Ponguleti Srinivas Reddy on BRS : గత ప్రభుత్వం పదేళ్లలో పేదవారికి ఇళ్లు గానీ, రేషన్ కార్డులు గానీ, పెన్షన్లు గానీ ఇవ్వకుండా మోసం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కానీ కాంగ్రెస్ అలా కాదని పేదల పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి అందరూ బాగుండాలని కోరుకుంటోందని చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ప్రజల వద్దకే మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో ఆయన పర్యటించారు.
ఈ క్రమంలో కొత్త కొత్తూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్ వచ్చింది కరవు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి అంటున్నారని మరి ఇప్పుడు రోహిణి కార్తెలో కూడా మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతోందని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.