LIVE : పద్మవిభూషణ్ చిరంజీవితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్​చాట్ - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 9:02 AM IST

Updated : May 10, 2024, 10:26 AM IST

thumbnail
Megastar Chiranjeevi interview with Kishan Reddy : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి, పద్మవిభూషణ్​, మెగాస్టార్​ చిరంజీవి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పద్మవిభూషణ్​ చిరంజీవి వేసిన పలు ప్రశ్నలకు కిషన్​రెడ్డి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. జీ20 మీటింగ్ శ్రీనగర్ లో పెట్టడానికి మోదీ అన్ని రకాలుగా సహకరించారు. ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు 300 పైగా సినిమా షూటింగులు కాశ్మీర్లో జరిగాయని కిషన్​ రెడ్డి తెలిపారు. అలాగే గత ప్రభుత్వాలు ఎప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి టార్గెట్ పెట్టుకోలేదు. కానీ 2047 సంవత్సరానికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారి ఎర్రకోట నుండి జెండా ఎగురవేయడమే మోదీ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు జాతి గర్వపడే మెగాస్టార్​ చిరంజీవికి పద్మవిభూషణ్​ పురస్కారం అందుకున్న సమయంలో వారిని కలిసి అభినందించిన సందర్భంగా జరిగిన ఆత్మీయ భేటీ అంటూ కిషన్​రెడ్డి ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. ఇప్పుడు వారిద్దరి ఇంటర్వ్యూను ఈటీవీ భారత్​లో చూసేద్దాం.
Last Updated : May 10, 2024, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.