thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 13, 2024, 9:17 PM IST

ETV Bharat / Videos

ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు - CBN sign repeal of Land Titling Act

Lawyers Expressing Joy For Repeal of Land Titling Act: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి వారి భూమిపై హక్కు లేకుండా కుట్ర పూరితంగా అమలు చేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్​ను చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టామని న్యాయవాదులు తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.

జగన్​ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించారని న్యాయవాదులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్​ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 వేల మంది న్యాయవాదులు, రైతుల ఉమ్మడి విజయమని వారు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.