Pilot Project to Power Kuppam With Solar Energy : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్ సౌరభాలు విరబూస్తున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని ఎ.రంగంపేట, కందులవారిపల్లె, చిన్నరామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు.
ఈ మూడు పంచాయతీల్లో 2300 ఇళ్లపై సౌరపలకలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీఎం స్వగ్రామం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో 25 ఇళ్లకు సౌరపలకలు అమర్చారు. గ్రామంలో ఈ పనులన్నీ ఉగాదిలోపు పూర్తి చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పలకలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా, మిగిలిన వారికి బ్యాంకు రాయితీ కింద రుణంగా ఇస్తున్నారు.
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ - తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు