జూనియర్ వైద్యుల ఆందోళన - బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - Junior Doctors Agitation
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 12, 2024, 4:26 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-07-2024/640-480-21933517-thumbnail-16x9-junior-doctors-agitation-in-vijayawada.jpg)
Junior Doctors Agitation in Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జూనియల్ వైద్యుల డిమాండ్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దాడులను నిరసిస్తూ జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు.
గురువారం ఓ రోగి బంధువులు తమపై దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. చికిత్స చేసే సమయంలో రోగి మరణించాడు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ మృతుని బంధువులు దాడికి దిగారని వాపోయారు. దాడిని నిరసిస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్లను సైతం అసభ్యకరంగా దూషించారని నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.