రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లకు విరాళాల వెల్లువ - Donations to Amaravati

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 8:07 PM IST

thumbnail
రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లకు దాతల విరాళాలు (ETV Bharat)

Donations to Amaravati and Anna Canteens: కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. దీంతో ఆంధ్రుల కలల రాజధానికి ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. తాజాగా అమరావతి రాజధాని, అన్నా క్యాంటీన్లకు పలువురు విరాళాలు అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి దాతలు చెక్కులు అందించారు. కంకిపాడుకు చెందిన రైతు ఎన్.ప్రభాకర్ రావు 10 లక్షల రూపాయలు, విజయవాడకు చెందిన జీ.వీ.మాణిక్యాంబ అనే వృద్ధురాలు తన చేతికున్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. భగవద్గీత గ్రూపు తరఫున నిర్మల అనే వృద్ధురాలు 3.42 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. 

చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్లపల్లికి చెందిన జీవన్ కుమార్ అనే దివ్యాంగుడు 25 వేల రూపాయలు, చిత్తూరుకు చెందిన వల్లేరు వెంకటేశ్‌ నాయుడు లక్ష రూపాయలను రాజధానికి విరాళంగా అందించారు. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన పర్చూరి రాజబాబయ్య, కమల కుమారి అనే వృద్ధులు అన్నా క్యాంటీన్​కు 2 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వీరందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.