LIVE: కైకలూరులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - ప్రత్యక్షప్రసారం - Pawan Kalyan election campaign - PAWAN KALYAN ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/640-480-21374751-thumbnail-16x9-pawan-kalyan.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 1:55 PM IST
|Updated : May 3, 2024, 2:22 PM IST
Pawan Kalyan Election Campaign: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గురువారం పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండలో వారాహి విజయభేరి యాత్రలో పవన్ పాల్గొని వైసీపీ ఆగడాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రంగుల కోసం వైసీపీ 2వేల కోట్లు ఖర్చు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మొత్తంలో కొంత ఈ ప్రాంతంలో ఖర్చు చేసి ఉంటే తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తయ్యేదని తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే నాకు పంచ ప్రాణాలని సిక్కోలు, ఉత్తరాంధ్ర జానపదాలు నా గుండేల్లో పొంగుతాయన్నారు. ఉత్తరాంధ్రలో భగ భగ మండే యువత ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 60 రూపాయల మద్యాన్ని 200కి పెంచిందని అన్నారు. ఇక్కడి నాగవళి, వంశదార నదుల నుంచి వైసీపీ నేతలు ఇసుకను అడ్డంగా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఏలూరు జిల్లా కైకలూరులో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ప్రకాశం జిల్లా గిద్దలూరులో పవన్ పర్యటన కొనసాగుతుంది. సాయంత్రం నెల్లూరులో పవన్, చంద్రబాబు ఉమ్మడి ప్రచారంలో పాల్గొంటారు. ప్రస్తుతం కైకలూరులో పవన్కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం.
Last Updated : May 3, 2024, 2:22 PM IST