ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత - బారికేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లిన క్రికెట్‌ అభిమానులు - IPL 2024 - IPL 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 5:26 PM IST

IPL 2024 : ఉప్పల్‌ వేదికగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదే క్రికెట్‌ లెజెండ్‌ మహేంద్రసింగ్‌ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఉద్దేశంతో అభిమానులు స్టేడియానికి క్యూ కట్టారు. ఈ క్రమంలో స్టేడియానికి చేరుకున్న క్రికెట్‌ అభిమానులు టికెట్లు ఉన్న లోపలికి అనుమతించడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో ఉప్పల్‌ స్టేడియంలోని గేట్‌ నంబరు 4 వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గేట్‌ దగ్గర ఉన్న బారికేడ్లను తోసేసిన అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. అయితే ఇక్కడ పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సిబ్బంది ఒక్కొక్కరిని గేటు ద్వారా లోపలికి పంపిస్తున్నారు. మరోవైపు ఉప్పల్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జాం నెలకొంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ప్రియులు స్టేడియానికి క్యూ కడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.