భార్యను నరికి ఇంటి ముందే కత్తిపట్టుకుని కూర్చున్న భర్త- ఏలూరు జిల్లాలో దారుణం - HUSBAND KILLED WIFE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 7, 2024, 7:29 PM IST

thumbnail
భార్యను నరికి ఇంటి ముందే కత్తిపట్టుకుని కూర్చున్న భర్త- ఏలూరు జిల్లాలో దారుణం (ETV Bharat)

Husband Brutally Hacked his Wife to Death in Eluru District : కట్టుకున్న భార్యను నరికి చంపిన దారుణమైన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కొయ్యలగూడెం మండలం రామానుజపురంలో భార్యను భర్త హత్య చేశాడు. ఈ దారుణ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సూర్యచంద్రం, భార్య సాయి లక్ష్మి (35)కి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

 ఈ నేపథ్యంలో మరోసారి బుధవారం భార్యా భర్తలు గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటకు వస్తున్న సాయిలక్ష్మి మెడపై భర్త సూర్యచంద్ర కత్తితో నరికాడు. దీంతో సాయిలక్ష్మి ఘటనస్థలిలోనే విలవిల్లాడుతూ మృతి చెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కొయ్యలగూడెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన సూర్యచంద్రం ఇంటి ముందే కత్తి పట్టుకుని కూర్చోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.