సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్ - ఉద్రిక్తతతకు దారితీసిన బీఆర్ఎస్ ధర్నా - High Tension In Siddipet - HIGH TENSION IN SIDDIPET
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-08-2024/640-480-22229945-thumbnail-16x9-siddipet.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 17, 2024, 5:10 PM IST
High Tension In Siddipet : ఫ్లెక్సీ వివాదంతో సిద్దిపేటలో హైటెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల నినాదాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై ఉన్న ఫ్లెక్సీని కాంగ్రెస్ నాయకులు చింపడం వాగ్వాదానికి దారితీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీ నినాదాలతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టి వివాదాన్ని సద్దుమణిగించారు. బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంపై ఫ్లెక్సీలు చింపిన ఘటనకు నిరసనగా శనివారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే హరీశ్ రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అసంపూర్తిగా ఉందన్నారు. ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందో చూపించాలన్నారు. బస్టాండ్ వద్ద హోర్డింగ్పై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చింపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.