విజయవాడలో తంగలాన్​ టీమ్​ సందడి - సెల్పీలకు అభిమానుల ఉత్సాహం - Thangalaan Promotion at Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 12:37 PM IST

thumbnail
విజయవాడలో సందడి చేసిన తంగలాన్​ టీమ్​- చియాన్​తో సెల్పీలకు అభిమానుల ఉత్సాహం (ETV Bharat)

Hero Vikram visits Vijayawada Babai Hotel : విజయవాడలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగలాన్ ప్రమోషన్​లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో గాంధీనగర్​లోని బాబాయ్ హోటల్లో టిఫిన్ తిన్నారు. విక్రమ్​తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. హీరో విక్రమ్‌ ‘తంగలాన్‌’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటించిన ఈ పాన్‌ ఇండియా సినిమాని పా. రంజిత్‌ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వారు విజయవాడకు వచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జి.వి.ప్రకాశ్‌ కుమార్, ఛాయాగ్రహణం ఎ.కిశోర్‌ కుమార్‌ సమకూర్చారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.