By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 15, 2024, 10:23 AM IST
అర్ధరాత్రి రోడ్డుకు అడ్డంగా పడిన గ్రానైట్ లారీ - Granite Lorry Overturned in palnadu
Granite Lorry Overturned Near Lingamguntla in Palnadu District : పల్నాడు జిల్లా లింగంగుంట్ల సమీపంలో గ్రానెట్ లారీ బోల్తా పడింది. మార్టూరు నుంచి నరసరావుపేట వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అర్ధరాత్రి వేళ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మార్జిన్ దిగడంతో అదుపుతప్పి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. గ్రానెట్ పలకలన్నీ రోడ్డుపై పడి పగిలిపోయాయి. దీంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాహనాలను కోటప్పకొండ మార్గం వైపు మళ్లించారు.
ప్రయాణికులకు అంతరాయం కలగకుండా రోడ్డుపై అడ్డంగా పడిన గ్రానైట్ లారీని తొలగించి పలకలను కూడా పక్కకి నెట్టివేస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వాహనాలు కోటప్పకొండ మార్గంలో రాకపోకలు సాగించాలని కోరారు. లారీ బోల్తా కొట్టిన ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రోడ్డు ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.