thumbnail

మెదక్​ జిల్లాలో భారీ చోరీ - రూ.42 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు, 18 తులాల బంగారు ఆభరణాల అపహరణ

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 10:28 PM IST

Gold Biscuit Chori In Medak : మెదక్​ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్​లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి, గదిలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన బంగారు బిస్కెట్​లు, అభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగారెడ్డిపేట్​ గ్రామానికి చెందిన రమేష్, కాళ్లకల్​లోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతని మామ బోబిల్ల సత్తయ్య పది రోజుల క్రితం వెంకటాయపల్లిలో చనిపోగా, దశదిన కర్మ కోసం కుటుంబంతో కలిసి ఈ నెల 6న వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా, ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. 

ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం కింద ఉన్న కబోర్డు​లో ఉన్న 5 బంగారు బిస్కెట్లు (50 తులాలు), బీరువాలో పెట్టిన రూ.18 తులాల బంగారు అభరణాలు పోయాయని, దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి తూప్రాన్ సీఐ కృష్ణ చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.