శాంతించిన గోదారమ్మ - భద్రాచలం వద్ద తగ్గిన నీటిమట్టం - రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులు - Godavari Water At Bhadrachalam - GODAVARI WATER AT BHADRACHALAM
🎬 Watch Now: Feature Video


Published : Jul 24, 2024, 10:22 AM IST
Godavari Water Level At Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కాస్త శాంతించడంతో ఎగువ నుంచి వరద తీవ్రత లేదు. దీంతో గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతుంది. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్దకు చేరిన నీటిమట్టం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ రోజు ఉదయానికి 47.3 అడుగుల వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు అడుగుల నీటిమట్టం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు.
ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. నీటిమట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. నీటిమట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటిమట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు సైతం వరద నీటి నుంచి తేరుకోనున్నాయి.