భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం - కొనసాగుతున్న రెండో వార్నింగ్ - BHADRACHALAM GODAVARI WATER LEVEL

By ETV Bharat Telangana Team

Published : Jul 28, 2024, 12:38 PM IST

Updated : Jul 28, 2024, 2:02 PM IST

thumbnail
భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి - కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక (ETV Bharat)

Godavari Water Level At Bhadrachalam Today :  గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం పరివాహక ప్రాంతంలో గోదావరి ప్రవాహంలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. అంతకంతకూ పెరుగుతూ అప్పుడే మళ్లీ తగ్గుతోంది. శనివారం రాత్రి  53.8  అడుగులు చేరిన గోదావరి నీటిమట్టం, రాత్రి 9 గంటల నుంచి తగ్గుతూ వస్తోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53.2 అడుగుల వద్దకు చేరుకుంది. 10 గంటల సమయానికి నీటిమట్టం 52.1 అడుగులుగా నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 50.5 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. 

శనివారం గోదావరి నీటి మాట్టం 53  అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాత్రి వచ్చిన నీటితో స్నానఘట్టాలు నీట మునిగాయి. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరడంతో దిగువ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తున్నారు. 

Last Updated : Jul 28, 2024, 2:02 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.