మెదక్​ జిల్లాలో విషపూరిత మొక్కలు తిని 45 మేకలు మృతి - Medak Goat Dead

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 3:22 PM IST

Updated : Feb 27, 2024, 3:55 PM IST

Goat Dead In Medak : పశువుల, మేకల కాపరులు అవే జీవానాధారంగా బతుకుంటారు. అవి చనిపోతే సొంత మనుషులు దూరం అయినట్లు బాధ పడుతారు. మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విషపు మొక్కలు తిని 45 మేకలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగి మల్లన్నగుట్ట అటవీ ప్రాంతంలో గత రాత్రి జరిగింది. మెదక్​ జిల్లా వల్లాభాపూర్ గ్రామానికి చెందిన బత్తుల సాయిలు రోజు మాదిరిగానే అటవీ ప్రాంతానికి మేకలను మేతకు తీసుకెళ్లాడు. స సాయంత్రం ఇంటికి తీసుకొచ్చిన కాసేపటికి ఒక్కొక్కటిగా నురగలు కక్కడం గమనించాడు. వెంటనే మేకల కాపరి పశువైద్యాధికారి జీవన్​ ప్రతాప్​ను సంప్రదించగా మందులు సూచించాడు. 

మెదక్​లో మేకలు 45 మృతి :  మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 9 గంటల వరకు ఒక్కొక్కటిగా 45 మేకలు చనిపోయాయి. ఒకేసారి 45 మేకలు మృతి చెందడంతో కుంటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మూగజీవాలే జీవానాధరంగా బతుకుతున్నా తనను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. 

Last Updated : Feb 27, 2024, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.