thumbnail

వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యం: పల్లె రఘునాథ్‌రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 4:38 PM IST

Former Minister Palle Raghunath Reddy Election Campaign: వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి(YCP MLA Sridhar Reddy) పుట్టపర్తి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి(Former Minister Palle Raghunath Reddy) అన్నారు. సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కృష్ణాపురం, గోపాలపురంలో రఘునాథ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం(Election Campaign) చేపట్టారు. 

ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు(TDP Chief Nara Chandrababu Naidu) ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాల(TDP Super Six Schemes)ను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం(TDP), జనసేన నాయకులు(Janasena Leaders) పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయమని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే పుట్టపర్తి అభివృద్ధి(Development of Puttaparthi Constituency)కి సాధ్యమవుతుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి అన్నారు.

"రాబోయే ఎన్నికల్లో వైసీపీ పతనం ఖాయం. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యం. టీడీపీ అధికారంలోకి వస్తే పుట్టపర్తి అభివృద్ధికి సాధ్యమవుతుంది." - పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ మంత్రి

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.