పత్తి చేనులో మొసలి ప్రత్యక్షం - అధికారులొచ్చేలోపు పక్కనున్న బావిలోకి - చివరకు? - Police caught crocodile

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2024, 2:01 PM IST

thumbnail
పొలంలో మొసలి- స్థానికులు గుర్తించి వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం (ETV Bharat)

Forest officers caught a crocodile in Jogulamba District : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్​లో బావిలో తలదాచుకున్న మొసలిని 5 గంటల పాటు శ్రమించి అటవీ అధికారులు బంధించారు. వివరాల్లోకి వెళితే పత్తి చేనులో పని చేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ ఆఫీసర్స్‌ వచ్చి మొసలి కోసం గాలించగా, బావిలోకి దిగి తలదాచుకుంది. మకరాన్ని తాళ్లతో బంధించేందుకు ఐదు గంటల పాటు శ్రమించారు. బావిలోంచి లాగేందుకు నానా కష్టాలు పడ్డారు. చివరకు మొసలిని బావిలో నుంచి పైకి తీసుకొచ్చి ట్రాక్టర్‌లో తరలించి కృష్ణా నదిలో వదలిపెట్టారు. మొసలిని పైకి తెచ్చే ప్రయత్నంలో స్థానికుల సహకారం మరువలేనిదని పోలీసులు వారిని అభినందించారు. ఈ క్రమంలోనే పాములు, మొసళ్లు, అడవి జంతువులు వంటివి ఏవైనా జనారణ్యంలోకి వస్తే, వాటికి ప్రాణహాని తలపెట్టొద్దని, అటవీ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.