thumbnail

వైఎస్​ షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేకపోతున్నారు​: టీడీపీ నేత వీర శివారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 8:07 PM IST

EX MLA Fire On CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్​ రెడ్డి పాలిట షర్మిల కాళికామాత అని తెలుగుదేశం నేత వీర శివారెడ్డి అన్నారు. షర్మిల సంధించే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేక భయపడుతున్నారని శివారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు. చంద్రబాబు అధినేత నమ్మకంతో తనను పార్టీలో చేర్చుకున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏదో ఆశించి తెలుగుదేశంలోకి రాలేదని, తన అనుభావాన్ని తెలుగుదేశం విజయానికి ఉపయోగించడానికే పార్టీ మారినట్లు శివారెడ్డి తేల్చి చెప్పారు. ఇసుక,  మద్యం, మైనింగ్​ వంటి ద్వారా ప్రజాధనాన్ని దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. రాజశేఖర్​ రెడ్డి రాజకీయ లక్షణాలు జగన్​లో ఒక్క శాతం కూడా లేవని ఎద్దేవా చేశారు. 

"ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగి. 150 సీట్లు తీసుకుని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకున్నారు. దోచుకో దాచుకో అనే నినాదంతో జగన్​ పరిపాలన పక్కన పెట్టేశాడు." - వీర శివారెడ్డి, తెలుగుదేశం నేత

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.