సమయమివ్వకుండానే స్పందించమని నోటీసులిచ్చారు : వైఎస్సార్​సీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 5:33 PM IST

thumbnail

EX Minister Anam Narayana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్​ నోటీసులు జారీ చేసిన అంశంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పందించారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాగా, వారిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ నెల 29న తమ ఎదుట  హాజరు కావాలని స్పీకర్​ ఆదేశించినట్లు వెల్లడించారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చించి, న్యాయ సలహాలు, సూచనల మేరకు తదుపరి తమ స్పందనను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. నోటీసులు చీఫ్​ విప్​, స్పీకర్​ కార్యాలయం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ నోటీసులపై పూర్తి స్పష్టతను ఇచ్చేందుకు తమకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని తాము సమాధానం ఇచ్చినట్లు పేర్కోన్నారు.  తాము పంపిన సమాధానం కవర్​ అందక ముందే సమయం ఇవ్వడం కుదరదని మరో నోటీసు జారీ చేశారని వివరించారు. అందులో సమయం ఇవ్వడం కుదరదని తప్పకుండా ఈనెల 29న హాజరు కావాల్సిందేనని వచ్చినట్లు వివరించారు. గంటా శ్రీనివాస్​ మూడు సంవత్సరాల క్రితం రాజీనామా లేఖను అందిస్తే ఇప్పుడు అమోదించారని, అది కూడా రాజీనామాను ఆమోదించే ముందు మరోసారి సంప్రదించాలన్న సంప్రదయాన్ని  స్పీకర్ కార్యాలయం పాటించలేదని ఆనం చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.