By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 4:07 PM IST
గుక్కెడు నీటికి పుట్టెడు కష్టాలు - సీఎం జగన్ సొంత జిల్లాలోనూ అదే పరిస్థితి - Drinking Water Problems in kadapa
Drinking Water Problems in CM Own District : సీఎం జగన్ సొంత జిల్లాలోని కమలాపురం మండలం వై. కొత్తపల్లె ఎస్సీ కాలనీవాసులు తాగునీటికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించినా అది నిరుపయోగంగానే మారిందని ఆరోపిస్తున్నారు. సమస్యను అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదన్నారు. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీటి కోసం పొలాల వద్దకు వెళ్లి బోర్ నీటిని పట్టి తెచ్చుకుంటున్నామని మహిళలు వాపోయారు. విద్యుత్ సరఫరా లేకుంటే అవీ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
త్రాగునీరు రాకపోవడంతో రైతుల పొలాల్లోని మోటారు పంపు వద్ద నీరు పట్టుకుని గొంతు తడుపుకుంటున్నామని తెలిపారు. ఆ నీరు పట్టుకునే సమయంలో యజమాని చూస్తే తమపై గొడవకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే తాము పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి రావాల్సి వస్తోంది. ఇది చాలా ఇబ్బందిగా ఉందని మహిళలు వాపోతున్నారు.