thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 6:52 PM IST

ETV Bharat / Videos

సమస్యలు పరిష్కరించాలంటూ హైవేపై దివ్యాంగుల ఆందోళన

Disabled People Protest on National Highway in Kurnool: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు లోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజ్యంగం ప్రకారం దివ్యాంగులకు రావాల్సిన పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదని దివ్యాంగుల నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. కేవలం పింఛన్లు మాత్రమే ఇస్తూ అన్ని సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసిందని వాపోయారు. దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాలు కానీ వాహనాలు కానీ ఉద్యోగాలు కానీ ఇలా ఎలాంటి పథకాలు కూడా జగన్ ప్రభుత్వంలో రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దివ్యాంగులకు రావాల్సిన పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దివ్యాంగులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో దివ్యాంగులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.