LIVE : శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ - Telangana Assembly Session Live

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 10:05 AM IST

Updated : Jul 31, 2024, 3:56 PM IST

thumbnail
Telangana Assembly Session Live : ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభతోపాటు మండలిలో బుధవారం చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం జులై 25వ తేదీన ఉభయ సభల్లో ప్రవేశపెట్టింది. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్‌పై సాధారణ చర్చతోపాటు అసెంబ్లీలో పద్దులపై కూడా చర్చ పూర్తయింది. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టారు. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బుధవారం కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ద్రవ్య వినమయ బిల్లుపై చర్చకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సమాధానం ఇస్తున్నారు. శాసనసభలో ఆమోదం పొందిన అనంతరం, ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలోనూ చర్చిస్తారు. అక్కడ కూడా డిప్యూటీ సీఎం సమాధానం ఇస్తారు. మండలిలోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభ ముందుకు బుధవారం మరో రెండు బిల్లులు వచ్చాయి. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాల బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
Last Updated : Jul 31, 2024, 3:56 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.