thumbnail

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే సమాజంలో మార్పు - జగన్నాథ రథయాత్రలో సీఎం రేవంత్ - ISKCON Temple Jagannath Rath Yatra

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 2:17 PM IST

CM Revanth Reddy Started ISKCON Temple Jagannath Rath Yatra : మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో తమ ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్​ స్టేడియం వద్ద ఇస్కాన్​ టెంపుల్​ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్న ముఖ్యమంత్రి  రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్​, అంజన్​ కుమార్​ యాదవ్​ పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. అన్ని మతాల భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని చెప్పారు. రాష్ట్రం శాంతి సౌఖ్యాలతో, సుభిక్షంగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి ప్రార్థించారు. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చారు. అలాగే రథానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.