LIVE : సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం రేవంత్​ రెడ్డి - Revant open Sitarama Project

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 1:36 PM IST

thumbnail
CM Revanth Reddy Launched Sitarama Project : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో సీతారామ ప్రాజెక్టులోని పూసుగూడెం పంప్​ హౌస్​ను ప్రారంభించారు. ముందుగా హైదరాబాద్​లోని పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్​లో తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన రెండోదైన పూసుగూడెం పంప్​ హౌస్​ను లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సీతారామ ప్రాజెక్టులో భాగంగా మొత్తం మూడు పంప్​ హౌస్​ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు పంప్​ హౌస్​లను ఇప్పటికే ట్రయల్​ రన్​ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్​ హౌస్​ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించగా, కమలాపూర్​ పంప్​ హౌస్​ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు తొలి పంప్​హౌస్​ను జిల్లా ఇంఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మూడో విడత రుణమాఫీలో భాగంగా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణాల ప్రక్రియను ప్రారంభించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.