thumbnail

టీడీఆర్ బాండ్ల స్కాంలో జగన్‌ను అరెస్టు చేయాలి: బుద్ధా వెంకన్న - Buddha Venkanna on Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 9:15 PM IST

Buddha Venkanna Allegations on Jagan about TDR Bond Scam : రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల పేరుతో జరిగిన వేల కోట్ల కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసి విచారణ చేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కోరారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వేల కోట్లు దోచేశారని ఇదంతా వైఎస్ జగన్ డైరెక్షన్​లో జరిగిందని ఆరోపించారు. వైఎస్ జగన్‌ ప్రమేయంతోనే వేలకోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆయన అరోపంచారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి కుంభకోణాలపై సీఐడికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. త్వరలో ఏపీ సీఐడీకి లిఖితపూర్వకంగా టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై ఫిర్యాదు చేస్తామని అన్నారు. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బుద్దా వెంకన్న విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.